క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి

క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రెస్తవులందరికీ వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు.
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని తెలిపారు.
క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు.
What's Your Reaction?






