రైలు ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం. జగన్

జనసాక్షి :
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.- సీఎం జగన్
-ఏరియల్ రివ్యూ ద్వారా విజయనగరం రైలు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం జగన్.
- ఆపదలో నేనున్నానని రైలు ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్
What's Your Reaction?






