రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. CM జగన్
రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు ఇస్తున్నాం. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు,ఇనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాము- సీఎం జగన్
What's Your Reaction?






