ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీకానున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్
తాడేపల్లి జనసాక్షి :
ఈరోజు సాయంత్రం రాజ్భవన్కు వైయస్. జగన్.
గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి.
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గం.కు రాజ్భవన్ వెళ్లి, గవర్నర్ శ్రీ ఎస్.అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్నారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైయస్ జగన్, రాష్ట్ర గవర్నర్కు వివరించనున్నారు.
వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిధున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను శ్రీ వైయస్ జగన్, గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్కు అందజేస్తారు.
What's Your Reaction?






