రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరు చేయడంలో తన వంతు కృషి చేస్తా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్

Jul 5, 2024 - 09:15
Jul 5, 2024 - 09:18
 0  28

నెల్లూరు  జనసాక్షి  :రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయుటలో తన వంతు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.గురువారం ఉదయం నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఓ. ఆనంద్ పదవీ భాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు మంత్రోత్సారణలు మధ్య వారి ఆశీర్వాదం అందుకున్నారు.తోలుత జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఇంచార్జి డి ఆర్ ఓ పద్మావతి నూతన కలెక్టర్ ఆనంద్ కు స్వాగతం పలికారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సర్వీస్ లో మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో పని చేశానని, ప్రస్తుతం కలెక్టర్ గా జిల్లా కు రావడం సంతోషం గా ఉందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించుటలో కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow