మూడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

Apr 30, 2024 - 17:46
 0  249
మూడు విమానాశ్రయాలకు  బాంబు బెదిరింపులు

మూడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు..

హైదరాబాద్  జనసాక్షి  :

దేశంలో బాంబు బెదిరిం పులు కలకలం సృష్టిస్తున్నా యి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

సోమవారం ఉదయం రాజ స్థాన్‌లోని జైపూర్, మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌, గోవా విమానాశ్రయాలకు ఈమె యిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

దీంతో వెంటనే ఆయా విమా నాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. రంగం లోకి దిగిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. 

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపిం చలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్‌ నేప థ్యంలో ఆయా విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమె యిల్‌ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. 

కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, పలు విమానా శ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 

ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow