దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి
జనసాక్షి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడిపిక్కల లోడ్తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.
What's Your Reaction?






