సీఎం చంద్రబాబు నాయుడుని కలసిన వేమిరెడ్డి దంపతులు

Nov 4, 2024 - 12:41
 0  181
సీఎం చంద్రబాబు నాయుడుని కలసిన వేమిరెడ్డి దంపతులు

సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు

- ప్రశాంతి రెడ్డికి టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు

 జనసాక్షి : నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow