కనిగిరి డిపో నుండి అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు

జనసాక్షి కనిగిరి : మాఘ పౌర్ణమి సందర్భంగా APSRTC కనిగిరి డిపో వారి అరుణాచల యాత్ర. తేదీ:22/02/2024 గురువారం రాత్రి 09:00 గంటలకు కనిగిరి డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ తెలిపారు. గురువారం రాత్రి కనిగిరి డిపో నుండి బయలుదేరి శుక్రవారం నాడు కానిపాకం, తిరుత్తని, కంచి దర్శించుకుని 24/02/2024. శనివారం వేకువజావున 02:00 గంటలకు అరుణాచలం చేరుకొని ఉదయం నుండి గిరి ప్రదక్షణ చేసుకుని తిరుగు ప్రయాణంలో గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి దర్శించుకొని 25/02/2024. మధ్యాహ్నం కనిగిరి చేరుతుందని డిపో మేనేజర్ తెలిపారు. టిక్కెట్టు ధర ఒకరికి :2200/- కావున ఈ సదవకాశమును భక్తులందరూ వినియోగించుకోవలసిందిగా కనిగిరి డిపో మేనేజర్ B. శ్రీమన్నారాయణ కోరారు.టికెట్ల కొరకు సంప్రదించండి. P. మహేష్ 9652260174. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.
What's Your Reaction?






