రామాయపట్నం పోర్టును సందర్శించిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు

Feb 3, 2026 - 22:13
Feb 3, 2026 - 22:17
 0  164
రామాయపట్నం పోర్టును  సందర్శించిన సింగపూర్  ప్రభుత్వ ప్రతినిధులు

రామాయపట్నం పోర్టును సందర్శించిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు

రామాయపట్నం పోర్టును సింగపూర్ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో కీలకమైన ఈ పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ, భూ సేకరణ అధికారులతో చర్చించారు. ఆ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.  

ఈ బృందంలో సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తరఫున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా ( రిటైర్డ్ ), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైస్ తరఫున థాయ్, నిషా, వాణిజ్య - పరిశ్రమల శాఖ తరఫున ఫ్రాన్సిస్ ఉన్నారు. కాగా ఈ వివరాలను తెలియజేసిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఏపీ మ్యారీ టైం బోర్డు ఈ.ఈ. శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow