తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆహ్వానం

Sep 22, 2024 - 12:34
Sep 22, 2024 - 12:37
 0  331
తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి జనసాక్షి :- పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి...బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow