మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
మార్కాపురం జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.తెల్లవారితే పెళ్లి పెళ్లి కూతురు కి ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన ప్రమాదం..కంభంలో హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి ...మృతులు గిద్దలూరు నల్లబండ బజార్కు చెందిన ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నాగేశ్(17), ఆవుల నాగేశ్వరి (2) గా గుర్తించిన పోలీసులు . కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 8 మంది వ్యక్తులు..ప్రమాదానికి గురైన వారందరూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు...లారీ డ్రైవర్ అతివేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదం...ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
What's Your Reaction?