ఆటోను ఢీకొన్న కారు - ఇద్దరు మృతి

Mar 14, 2026 - 11:46
 0  264
ఆటోను ఢీకొన్న కారు - ఇద్దరు మృతి

ఆటోని ఢీ కొన్న కారు - ఇద్దరు మృతి 

గుడ్లూరు జన సాక్షి :

 ముందు పోతున్న ఆటోని ఎనక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై మోచర్ల- వీరేపల్లి గ్రామాల మధ్య శనివారం జరిగింది.వివరాలు ప్రకారం వీరేపల్లి ఎస్టి కాలనికి చెందిన కూలీలు కట్టె కొట్టు డు కొట్టడానికి ఆటో కావలి మండలానికి వెళుతుండగా ఒంగోలు నుంచి నెల్లూరు వైపు కు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఆటో కొట్టంది. దీంతో ఆ ఆటోలో ఉన్న వారు రోడ్డు పై పడగా తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కావలి ఏరియా వైద్య శాలకు తరలించారు. అక్కడ ఇద్దరు మృతి చెందారు. మిగతా వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow